కడప నగరపాలక సంస్థ కమిషనర్ చంద్ర ఇవాళ మార్నింగ్ విజిట్లో భాగంగా 12వ, 14వ డివిజన్లలో పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. ప్రాంతాల్లో జరుగుతున్న శుభ్రత కార్యక్రమాలను సమగ్రంగా పరిశీలించి, పనుల నాణ్యతపై శానిటేషన్ అధికారులు నిరంతరం సమీక్ష నిర్వహించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణకు ఆదేశించారు.