ATP: మంత్రి పయ్యావుల కేశవ్ సహకారంతో ఉరవకొండ నియోజకవర్గంలోని 74 మంది లబ్ధిదారులకు రూ.43.37 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను టీడీపీ నాయకుడు పయ్యావుల శ్రీనివాసులు పంపిణీ చేశారు. పెద్ద కౌకుంట్ల గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐదు మండలాలకు చెందిన బాధితులకు ఆర్థిక సాయం అందజేశారు.