VSP: ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో ఈనెల 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సివిల్, చెక్ బౌన్స్, మోటార్ ప్రమాద కేసులు, రాజీ పడతగిన క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.