CTR: పాలసముద్రం మండలం ఆముదాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు విద్యా సామాగ్రిని తాళ్లూరి శివ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “క్రమశిక్షణతో చదువుకుంటే జీవితం బంగారు లోకంలా మారుతుంది. విద్యార్థులు మంచి చదువుతో పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో పెనుమూరు మార్కెటింగ్ కమిటీ వైస్ ఛైర్మన్ అరుల్ నాదన్ పాల్గొన్నారు.