ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయి గూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్గశిర శుద్ధ త్రయోదశి సందర్భంగా హనుమద్ వ్రతం కార్యక్రమం సామూహికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. పూజలు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.