KDP: మైదుకూరులోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఓబులరెడ్డి ఇవాళ తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. జాబ్ మేళాకి విద్యార్హత పత్రాలు తీసుకురావాలని సూచించారు.