PPM: జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు మన్యం జిల్లా ఎక్సైజ్, ఒడిశా ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా అంతరాష్ట్ర దాడులు గురువారం నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 4800 లీటర్ల బెల్లపు ఊట, 170 లీటర్ల నాటుసారా ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. నిర్వాహకులపై మూడు కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ శిరీష తెలిపారు.