కృష్ణా: నవోదయ ప్రవేశ పరీక్షల ఫలితాల్లో బాపులపాడు విద్యార్థులు మెరిశారు. నవోదయ విద్యాలయ సమితి ఆరో తరగతి ప్రవేశానికి నిర్వహించిన పరీక్షల్లో బాపులుపాడుకు చెందిన దేవాన్ష్ మౌనిష్, స్టాన్లే ప్రతిభ కనబరిచి ఆరో తరగతి ప్రవేశానికి ఎంపికయ్యారు. పాఠాలు బోధించిన ఉపాధ్యాయులు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో విద్యార్థుల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.