VSP: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు–2025కు దేశవ్యాప్తంగా 45 మందిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. సెప్టెంబర్ 5న ఢిల్లీలో అవార్డులు ప్రదానం చేయనున్నారు. విశాఖకు చెందిన తిరుమల శ్రీదేవి ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. అవార్డుతో పాటు రూ.50 వేలు, వెండి పతకం అందజేస్తారు. విశాఖకు చెందిన ఉపాధ్యాయురాలు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సాధించినందుకు పలువురు అభినందనలు తెలిపారు.