VZM: భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు ‘బాబూ’ జగజీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఎం.రామసుందరరెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం డా.br .అంబేద్కర్ గురుకుల పాఠశాలల విద్యార్ధులు ఆయన సేవలను నృత్య ప్రదర్శన ద్వారా చూపారు.