SKLM: పొందూరు మండలంలోని తాడివలస, లోలుగు సబ్స్టేషన్ల పరిధిలోని గ్రామాలకు ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా సరఫరా నిలిపివేయనున్నట్లు ఎలక్ట్రికల్ ఏఈ సుధీర్ తెలిపారు. మరమ్మతు పనులు సమర్థవంతంగా పూర్తయ్యేలా అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలు ఈ సమయంలో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.