ప్రకాశం: గిద్దలూరులోని జిల్లా ప్రజా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు సమగ్ర ఐఈసీ ప్రచార రథం 2025 కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో హెచ్ఐవి ఎలా వ్యాప్తి చెందుతుంది, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై అవగాహన కల్పించారు. అనంతరం ఈ వ్యాధికి చికిత్స లేదని, నివారణ ఒక్కటే మార్గమని తెలిపారు.