SKLM: కంచిలి మండలంలో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్ నాయకులు శుక్రవారం తహసీల్దార్ ఎన్. రమేష్ కుమార్కి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపులో భాగంగా వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ కంచిలి మండలం అధ్యక్షులు కార్యదర్శి రెళ్ల కామరాజు తదితరులు పాల్గొన్నారు.