KDP: ఆంధ్రప్రదేశ్ హెచ్ఐవి, ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆదేశాల మేరకు, ప్రొద్దుటూరులోని మున్సిపల్ హైస్కూల్లో చైతన్య ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవెలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో హెచ్ఐవి, ఎయిడ్స్ నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.