ప్రకాశం: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల పక్షపాతి అని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. ఇవాళ కనిగిరి మున్సిపల్ పరిధిలోని శంఖవరం ఎస్సీ కాలనీకి చెందిన చెంచాల సరోజనమ్మకి ముఖ్యమంత్రి సహాయక నిధి LOC ద్వారా రూ. 1,50,000 చెక్కును అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యమని ఆయన అన్నారు.