ASR: ఈ నెల 24న చింతూరులో జరిగే అమరవీరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ పిలుపునిచ్చారు. రంపచోడవరం ప్రాంతీయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చింతూరు, కూనవరం, వీఆర్ పురం, ఎటపాక ప్రాంతాల్లో అభివృద్ధి కోసం పోరాటాలు సాగించిన సీపీఎం నాయకుల త్యాగాలను స్మరించేందుకు సభ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.