VZM: ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఆర్టీసీ జోనల్ వర్క్ షాప్కు విచ్చేసిన ఛైర్మన్ సియ్యారి దొన్నుదొరను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఔట్సోర్సింగ్ స్టేట్ పబ్లిక్ సెక్రెటరీ అశోక్ మాట్లాడుతూ.. థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేసి, నేరుగా సంస్థ నుంచి జీతం వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.