కృష్ణా: గన్నవరం బాణా సంచా గోదామును రెవెన్యూ సిబ్బందితో కలిసి ఎస్సై ప్రశాంతి సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమాదాలు నివారించేందుకు ఫైర్ సేఫ్టీ పరికరాలు అందుబాటులో ఉన్నాయా లేదా అని పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యాలపై షాపు యజమానులకు సూచనలు అందించారు. భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.