W.G: ప్రతి ఒక్కరి ఓటు అభివృద్ధి వైపు ఉండాలి తప్ప, విధ్వంసం వైపు కాదని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఇవాళ యలమంచిలి మండలంలో రూ.3.48 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమాన్ని చూసి ఆశీర్వదించాలని కోరారు. రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడుతుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.