VSP: తవ్వి వదిలేసిన రోడ్లు ప్రజలకు కష్టసముద్రంగా మారాయి. వాహనదారులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హెచ్చరిక బోర్డులు, వన్వే సూచికలు లేక ప్రమాదాల ముప్పు పెరుగుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఆటోల్లో కుక్కుమనిపడి, కొందరు తోసుకుంటూ వెళ్లే పరిస్థితి. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.