ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మితపాలెం గ్రామంలో వెలిసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన నారాయణస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి ఆదివారం ప్రీతికన రోజు కావడంతో చుట్టుపక్క గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారికి పొంగళ్ళు నైవేద్యంగా పెట్టి తమ మొక్కలు తీర్చుకున్నారు.