శ్రీకాకుళం: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సంతబొమ్మాళి మండలం భావనపాడు మెరైన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాసరావు అన్నారు. గురువారం రాత్రి వజ్రపుకొత్తూరు మండలం, తామాడపేట గ్రామంలో ఎస్సైతో పాటు పోలీస్ సిబ్బంది పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు రవాణా జరిగితే, అటువంటి సమాచారం పోలీసులకు తెలియజేయాలన్నారు.