E.G: కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో రైతు నక్కా శ్రీనుకి చెందిన ఐదు గేదెలు శుక్రవారం విద్యుత్ షాక్తో మృతి చెందాయి. విషయం తెలుసుకున్న రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని రైతుని పలకరించి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని దైర్యం చెప్పారు. అనంతరం విద్యుత్ అధికారులతో మాట్లాడి రైతుకు నష్టపరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు.