NDL: రేపు జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే నంద్యాల జిల్లాలోని సుమారు 25,035 మంది విద్యార్థులకు కలెక్టర్ జి. రాజకుమారి శనివారం శుభాకాంక్షలు తెలిపారు. విద్య మనిషిని ఎక్కడైనా గౌరవనీయుడిగా నిలబెడుతుందన్నారు. విద్యార్థులు మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు గర్వకారణంగా నిలవాలని, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు.