KDP: ప్రతి ఒక్కరూ తెలుగు భాషపై మక్కువ పెంచుకొని, తెలుగు భాషను పరిరక్షించుకోవాలని భారత సుప్రీం కోర్ట్ విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి వెంకటరమణ పేర్కొన్నారు. కడప సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన తెలుగు వైభవం కార్యక్రమంలో ముఖ్య అధితిగా పాల్గొన్నారు. సీపీ బ్రౌన్ బ్రిటన్ నుంచి మన తెలుగు రాష్ట్రానికి వచ్చి తెలుగు భాషపై మక్కువ పెంచుకొని తెలుగు భాష కోసం కృషి చేశారన్నారు.