నెల్లూరు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అర్జీ దారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.