W.G: పాలకొల్లు పట్టణంలో ఆదివారం మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు హోం మంత్రి వంగలపూడి అనిత శనివారం రాత్రి పాలకొల్లుకు చేరుకున్నారు. ఈ క్రమంలో మంత్రి నిమ్మల ఆమెకు ఘన స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ పాల్గొన్నారు.