SKLM: పాతపట్నం మహాత్మా గాంధీ జ్యోతి పూలే బీసీ వెల్ఫేర్ బాలికల కళాశాల ప్రిన్సిపల్గా సోమవారం అరుణ నాయుడు బాధ్యతలు చేపట్టారు. విజయవాడలో శిక్షణ అనంతరం ఆమె మాట్లాడుతూ.. కళాశాల ప్రిన్సిపల్గా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సార్వకోట మండల విద్యాశాఖ అధికారి మడ్డు రామినాయుడు, పాతపట్నం ఎంఈవో పలువురు పాల్గొన్నారు.