నెల్లూరు: అమరావతి, ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేశ్ ఆహ్వానం మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులతో మంగళవారం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ అందించిన ఆత్మీయ స్వాగతం, చూపించిన ప్రేమాభిమానాలు తమను ఎంతో హత్తుకున్నాయన్నారు.