KRNL: ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధమైన సంఘటన హాలహర్వి మండలం కొక్కరచేడు గ్రామంలో చోటుచేసుకుంది. కొక్కరచేడు గ్రామానికి చెందిన బోయ గోవిందు, మాదిగ హనుమంతు, దేవరాజు, తదితరులకు సంబంధించి తమ పాడి పశువుల కోసం సుమారు లక్ష రూపాయలు విలువైన పశుగ్రాసం నిల్వ చేసుకున్నారని, ఇవాళ ఆకస్మికంగా మంటలు చెలరేగి పశుగ్రాసం మొత్తం కాలిపోయిందని స్థనికులు తెలిపారు.