AKP: మండల కేంద్రమైన మునగపాక సచివాలయం వద్ద శుక్రవారం ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు అనువుగా ఉండే విధంగా ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను రూపొందించిందని తెలిపారు. కార్డుల్లో పొరపాట్లు తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి అవకాశం ఉందన్నారు.