VSP: జనసేన పార్టీలో మహిళలకు ప్రత్యేక స్థానం కల్పిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పార్టీ క్యాడర్తో ఆయన మంగళవారం రాత్రి సమావేశం అయ్యారు. జనసేన పార్టీ అంటే ప్రశ్నించే పార్టీ అని అన్నారు. స్టీల్ ప్లాంట్ రక్షణకు జనసేన కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. జనసేనలో చేరిన కార్యకర్త ప్రతి ఒక్కరిని గౌరవించాలన్నారు.