నెల్లూరు నగరంలోని 24, 25వ డివిజన్లలో సోమవారం కమిషనర్ వై.వో నందన్ పర్యటించి పారిశుద్ధ్యం, సీసీ రోడ్ల నాణ్యతను పరిశీలించారు. భవన నిర్మాణాలకు ఖచ్చితంగా టౌన్ ప్లానింగ్ అనుమతులు ఉండాలని, తాగునీటి కుళాయి పన్నులను 100 శాతం వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీల్లో ఇంజనీరింగ్, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.