KKD: శంఖవరం మండలం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ప్రతీ ఆదివారం జరిగే రధోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు స్వయంగా పాల్గొని స్వామివారి సేవలో తరించారు. వారాంతం కావడంతో రత్నగిరి క్షేత్రానికి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు రధోత్సవ సేవను తిలకించి పునీతులయ్యారు. ఉదయం నుండచి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.