GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) దూరవిద్య కేంద్రం 2026 క్యాలెండర్ సంవత్సరానికి గాను 5 ఎంబీఏ స్పెషలైజేషన్లకు యూజీసీ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో నుంచి అనుమతి పొందినట్లు సీడీఈ డైరెక్టర్ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. అలాగే, మార్చి 8న జరగాల్సిన ఎంబీఏ ప్రవేశ పరీక్షను మార్చి 15వ తేదీకి వాయిదా వేసినట్లు ఆయన పేర్కొన్నారు.