VZM: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని మాజీ CM వైఎస్ జగన్ వ్యాఖ్యానించడాన్ని రాష్ట్ర ప్రజలు తప్పు పడుతున్నారని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి కోసం జగన్ తన ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలన్నారు.