PPM: సీతానగరం మండలంలోని కోట సీతారాంపురం గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి, ఒక సంపూర్ణ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు. ఇందుకోసం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, వాటిపై తీసుకున్న చర్యలు వివరించాలని అధికారులను కోరారు. బుధవారం ఆయన ఛాంబరులో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.