NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో అంబటి వెంకటేశ్వర్లు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తమ సమస్యల నిమిత్తం నిత్యం తహసీల్దార్ కార్యాలయానికి వస్తున్నారని తెలిపారు. ఎండాకాలం దృష్టిలో ఉంచుకుని వారి దాహాన్ని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ప్రారంభించామని చెప్పారు.