KRNL :మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి రూ. లక్ష విరాళంగా వచ్చిందని మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు తెలిపారు. రాజమండ్రికి చెందిన జనార్దన్ అనే భక్తుడు శ్రీ మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి ఇచ్చినట్లు పేర్కొన్నారు. విరాళం ఇచ్చిన దాతకు ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించారు. అనంతరం పీఠాధిపతి ఫలమంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు.