కృష్ణా: కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరిగిన నేపథ్యంలో నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇప్పటికే 3.96 లక్షల క్యూసెక్కుల నీటి విడుదలతో మొదటి హెచ్చరిక జారీ చేశామన్నారు. లంక గ్రామాలలో ప్రజలను అప్రమత్తం చేశామన్నారు.