ATP: గుంతకల్లులోని మోదీనాబాద్లో వెలిసిన శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో శనివారం శివుడు, నంది విగ్రహాల విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ పూజా కార్యక్రమానికి వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి హాజరయ్యారు.