సత్యసాయి జిల్లాను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. బుధవారం పుట్టపర్తి కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ మౌర్య భారద్వాజ్తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. పుట్టపర్తిని పర్యావరణ-ఆధ్యాత్మిక హబ్గా మార్చడం, బుక్కపట్నం చెరువులో సత్యసాయి బాబా భారీ విగ్రహ ఏర్పాటుపై చర్చించారు.