SS: పుట్టపర్తిలో రెవెన్యూ, పోలీస్ జట్ల మధ్య ఆదివారం 20 ఓవర్ల స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ ఉత్సాహంగా జరిగింది. మొదట పోలీస్ జట్టు 120 పరుగులు చేయగా, ఎస్పీ సతీష్ కుమార్ 40 పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో రెవెన్యూ జట్టు 18.1 ఓవర్లలోనే విజయం సాధించింది. కలెక్టర్ శ్యాం ప్రసాద్, అశోక్, ఇమ్రాన్ కీలక పరుగులు చేసి జట్టును గెలిపించారు.