ప్రకాశం: కనిగిరి ఆర్టీసీ డిపో నుంచి ప్రతి ఆదివారం పాకల బీచ్కి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడపనున్నట్లు డిపో మేనేజర్ సయానా బేగం తెలిపారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రతి ఆదివారం ఉదయం 7:15, 8:15 గంటలకు, మధ్యాహ్నం 12:15, 1:15 గంటలకు బస్సులు బయలుదేరుతాయన్నారు. రూ. 80లు టికెట్ ధర కాగా, మహిళలకు శ్రీశక్తి పథకం అమలులో ఉంటుందన్నారు.