VSP: విశాఖలో త్వరలో జరగనున్న బీజేపీ సారథ్యం బహిరంగ సభ ముగింపు కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు జె.పి.నడ్డా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్.మాధవ్ శనివారం తెలిపారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సభ విశాఖలోని రైల్వే మైదానంలో జరుగుతుందని ఆయన వెల్లడించారు.