PLD: హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు సంబంధించిన భూవ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. గండిపేట ప్రాంతంలోని భూమికి సంబంధించిన పత్రాలు, ఆర్థిక లావాదేవీల అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసులో పలువురి పాత్రపై విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం దర్యాప్తు దశలో ఉందని పోలీసులు వెల్లడించారు.