KDP: పాలగిరి గ్రామంలో వెలసిన కన్నెటమ్మ అమ్మవారు ఆదివారం సందర్భంగా విశేషాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నిమ్మకాయలు, పూలదండలతో అందంగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. పలువురు తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.