CTR: నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శనివారం తన కార్యాలయంలో నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. పరిష్కారం అవసరమైన అంశాలపై వెంటనే స్పందిస్తూ సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.