ప్రకాశం: నోయిడా కార్మికులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్బంధాన్ని ఖండిస్తూ సింగరాయకొండలో IFTU ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. IFTU రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్ మాట్లాడుతూ.. నోయిడా పారిశ్రామిక కారిడార్లు ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నిస్తే 350 మంది కార్మికులను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. వారికి సంఘీభావంగా నిరసన చేసినట్లు తెలిపారు.