NLR: అల్లూరు మండల ప్రజలకు మండల రెవెన్యూ అధికారి లక్ష్మీనారాయణ పలు సూచనలు చేశారు. ఎండాకాలం దృష్ట్యా రానున్న రోజుల్లో ఎండలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రజలు అత్యవసర పని ఉంటే తప్ప ఉదయం 10:00 గం // నుండి సాయంత్రం 4:00 గం// మధ్యలో బయటకు రాకూడదని సూచించారు. వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.